భారత ఎన్నికల కమిషన్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆప్ నాయకులను ఓడించడానికి బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించలేదని, ఈ విషయంలో ఈసీ విఫలమైందన్నారు. తమకు సవాల్ విసురుతున్న రాజకీయ నాయకులను BJP లక్ష్యంగా చేసుకుని తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.