కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు డిసెంబర్ 3నాటికి నిండు కుండలా తొణికిసలాడుతోంది. బుధవారం ఉదయం వరకు ప్రాజెక్టులో 234 క్యూసెక్కుల స్వల్ప వరద ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, వస్తున్న ఇన్ఫ్లో ఆవిరి అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది రబీలో ఆయకట్టు రైతులకు నీరు పుష్కలంగా అందుతుందని తెలిపారు.