మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలో నిర్వహిస్తున్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ తో పాటు శతమానం భవతి దర్శకులు సతీష్ వేగ్నేశ, రచయిత చిన్నికృష్ణ, బలగం మధు, ఓదెల ఫేం సురేందర్ రెడ్డి, దేవనాథ్ జియర్ స్వామి, గంగోత్రి రామానుజదాసు స్వామి వారు యజ్ఞాచార్యులు శిఖామణి ఆచార్య, రోహిత్ కుమారాచార్య తదితరులు పాల్గొన్నారు