దుబాయ్ దేశ రాజధాని అబుదాబిలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం స్వామి నారాయణ్ దేవాలయాన్ని బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎల్లారెడ్డి సెగ్మెంట్ కు చెందిన బాణాల లక్ష్మారెడ్డి, అతని మిత్రులతో కలిసి సందర్శించారు. వీరితో పాటు వేల్పూర్ సంజీవ రెడ్డి, చంద్ర మోహన్, నర్సారెడ్డి, నీరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబాయి దేశంలో స్వామి నారాయణ దేవాలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు. ఆలయ నిర్వహణ తీరు చాలా బాగుందని వారు ప్రశంసించారు.