విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో చోటు చేసుకుంది. రాజంపేట ఎస్ఐ పుష్పరాజ్ కథనం ప్రకారం తలమడ్ల గ్రామానికి చెందిన పెట్టిగాడి రామచంద్రం (61) మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో నీరు పారించడానికి బోర్ స్టాటర్ స్టార్ట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించినట్లు ఎస్ఐ తెలిపారు.