కామారెడ్డి - ఎల్లారెడ్డి రహదారిపై రైతుల రాస్తారోకో

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యం సకాలంలో కొనుగోలు జరగక, లారీలు రాక, అకాల వర్షాలకు తడిసిపోతుంటే రైతులు రోడ్డెక్కారు. కొందరు రైతులు ధాన్యం బస్తాలను రోడ్డుపై తగులబెట్టి, లారీలు పంపించాలని నినాదాలు చేశారు. ఈ సంఘటన కామారెడ్డి - ఎల్లారెడ్డి రహదారిపై జరిగింది.

సంబంధిత పోస్ట్