బుధవారం 6వ రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సర మాథ్స్ 2 ఏ, బోటని 2, సివిక్స్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు ఎన్. విశాల, రాజశేఖర్, సమిత, పద్మ లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 204 మందికి 203 మంది హాజరు కాగా ఒక్క విద్యార్థి గైర్హాజరయ్యారు. ఆదర్శ కళాశాల కేంద్రంలో 195 మందికి గాను 193 మంది పరీక్షకు హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు.