కామారెడ్డి: యువకునిపై కత్తితో దాడి కలకలం

కామారెడ్డి పట్టణంలోని రామేశ్వర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు గల వెంచర్ లో బుధవారం ఓ యువకునిపై కత్తితో దాడి జరిగింది. మద్యం తాగే క్రమంలో చింటూ అనే యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అతని కడుపులోని పేగులు బయటకు వచ్చాయి. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు రూరల్ సిఐ రామన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్