జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం డోంగ్లీ మండల కేంద్రంతో పాటు మోఘ, ఏలేగావ్, కుర్లా గ్రామాల్లో పొద్దుతిరుగుడు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు తమ పంటను శుభ్రపరచి, ఆరబెట్టి మార్కెట్ యార్డ్కు తీసుకురావాలని ఆయన సూచించారు. పొద్దుతిరుగుడు ధాన్యాన్ని క్వింటాల్కు రూ. 7721, వరి ధాన్యాన్ని క్వింటాల్కు రూ. 2389 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.