కామారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం అని, విద్య, క్రీడలు, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపడం తన లక్ష్యం అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్ నేతలున్నారు.