ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు జీవనాధారమైన నిజాంసాగర్ ప్రాజెక్టులో జనవరి 10వ తేదీ నాటికి 1402. 44 అడుగుల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 17. 802 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లో 14. 253 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రధాన కాల్వ ద్వారా నీటి విడుదల నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు.