కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ ఏఈ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం, మండల కేంద్రంతో పాటు ధర్మారావుపేట, మల్లుపేట గ్రామాల్లో ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేపట్టనున్నందున ఈ అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.