జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో తగిన నిల్వలు ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, సహకార శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, వర్షాకాల సాగు నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.