చోరీ కేసులో నిందితుడికి 16 నెలల జైలు శిక్ష పడింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ గర్భగుడిలోని హుండీ తాళం పగలగొట్టి డబ్బులు దొంగలించినట్లు ఎల్లారెడ్డి పిఎస్ లో కేసు నమోదయింది. పోసాని పల్లి గ్రామానికి చెందిన జంగం నర్సింలును నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసి, నేరం రుజువు కావడంతో ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 16 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.