బెంగళూరు టెకీ సూసైడ్‌‌పై కంగన సంచలన కామెంట్స్

భార్య వేధింపులు తాళలేక బెంగళూరుకు చెందిన టెకీ అతుల్‌ సుభాష్‌ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ స్పందించారు. ‘ఈ ఒక్క ఘటన ఆధారంగా మహిళలు అందరినీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవాళ్లదే తప్పు ఉంటోంది’ అని వ్యాఖ్యానించారు. సూసైడ్ చేసుకునే ముందు అతుల్‌ తీసుకున్న చివరి సెల్ఫీ వీడియోను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్