ధర్మపురి: పదేళ్లుగా చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది

గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం బుగ్గారం మండలంలోని పోచమ్మ ఫంక్షన్ హాల్ లో అర్హులైన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు. అదే విధంగా 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్