జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం SIR 2026 పై మండల సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు తహసిల్దార్ నిజాముద్దీన్ అవగాహన కల్పించారు. ఎలక్టోరల్ పత్రాలు నింపడంపై బిఎల్వోలు ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.