కరీంనగర్ నగరంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును ఆమె స్వయంగా పరిశీలించి, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరుపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.