హుజురాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో 72 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిమిత్తం స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి. పావని, ప్రధానోపాధ్యాయురాలు, గందే రజిత, సీఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.