కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక సమ్మక్క జాతరకు వెళ్లేందుకు పోలీసులు తమను నిరాకరించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు కేసీ క్యాంప్ వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని తమకు కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.