ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు ప్రజలు వినూత్న డిమాండ్లు చేస్తున్నారు. తమ గ్రామాల్లో కోతుల సమస్యను పరిష్కరించిన వారికే ఓట్లేస్తామని ఓటర్లు తేల్చి చెబుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో మనుషుల కంటే కోతుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రజలు బయట తిరగడానికి భయపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడమే అభ్యర్థులకు పెద్ద సవాల్గా మారింది.