రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను స్పీకర్గా నియమించే ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రిపదవి కోరడంతో ఈ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దళిత నేతకు స్పీకర్ పదవి అప్పగించాలన్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా అడ్లూరి పేరు ముందుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.