గురువారం తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నం శ్రీకాంత్ గౌడ్ (34) మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కరీంనగర్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ సోదరుడని గుర్తించారు.