తిమ్మాపూర్ మండలం నుస్తులాహర్లో శ్రీనివాస్ అనే భవన నిర్మాణ కూలీ వడదెబ్బతో శనివారం మృతి చెందారు. మక్తపల్లిలో కూలీ పనికి వెళ్లిన ఆయన, పని చేస్తుండగా అస్వస్థతకు గురై మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ మృతితో ఆయన భార్య, కూతురు అనాథలయ్యారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.