పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం వ్యవసాయ అధికారులతో యూరియా లభ్యత, పంపిణీపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అవసరాల కోసం యూరియా పంపిణీలో పిక్ డిమాండ్ సమయం ముగిసినప్పటికీ, అధికారులు అక్టోబర్ నెలాఖరు వరకు అప్రమత్తంగా ఉండాలని, పెండింగ్ డిమాండ్ తో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.