ఈ సందర్భంగా పీవీఏ విభాగం రూపొందించిన పొంగల్పై అద్భుతమైన టేబ్లూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్లీ ఇయర్స్ విద్యార్థులకు సంప్రదాయబద్ధమైన భోగి పళ్ళు కార్యక్రమం నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు. చిన్నారులు ఈ సంప్రదాయ వేడుకలో పాల్గొని ఎంతో ఆనందం పొందారు.
వేడుకల్లో భాగంగా సాంప్రదాయ గంగిరెద్దు ప్రదర్శనలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ బహుముఖ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు, పంటల పండుగ ప్రాముఖ్యతను లోతుగా అవగాహన చేసుకున్నారు. ప్రతి గింజ విలువను, ప్రతి ముద్ద వెనుక ఉన్న రైతు శ్రమను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకలు సంస్కృతి, సంప్రదాయం, ప్రకృతి పట్ల గౌరవాన్ని విద్యార్థుల మనసుల్లో బలంగా నాటాయి.