రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చింతల ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి బాలుడు (4) మృతి చెందాడని గ్రామ ప్రజలు తెలిపారు. మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.