శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి బద్దిపోచమ్మ, శ్రీ మహాలక్ష్మి ఆలయాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సతీమణి ఆది వనజ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడి బియ్యం, చీరే సారెలను అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదం అందజేశారు.