TG: హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు BRS ఎమ్మెల్సీ కవిత జాగృతి శ్రేణులతో కలిసి వచ్చారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళులర్పించారు. బీసీ బిల్లు ఆమోదం జాగృతి సాధించిన విజయమని కవిత తెలిపారు. ఆర్డినెన్స్ ప్రకటించి, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం పొందకుండా ఉంటే జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహిస్తామన్నారు. ఆర్డినెన్స్పై ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు.