మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఐదుగురు అధికారుల బృందం, డీఐజీ విజయ్ కుమార్, ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్, అడిషనల్ డీసీపీలు కేఎస్ రావు, రవీందర్ రెడ్డి కేసీఆర్ ఇంట్లోని 2వ ఫ్లోర్లో విచారణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. విచారణ కోసం కంప్యూటర్, ప్రింటర్, మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, కుర్చీలు, టేబుల్ను సిట్ అధికారులు వెంట తెచ్చుకున్నారు.