పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిని కోర్టు ముందు హాజరుపరచగా, పుణె న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల పాత్ర, హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత సమాచారం సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.