అహ్మదాబాద్‌లో కూలిన విమానంపై అధికారుల కీలక ప్రకటన

అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌పై అధికారులు విషయాలు వెల్లడించారు. 2023 జూన్‌లో ఈ విమానానికి పూర్తి తనిఖీలు నిర్వహించామని తెలిపారు. తదుపరి తనిఖీలు ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కుడి వైపు ఇంజిన్‌ను మార్చి 2025లో మరమ్మతులు చేసి అమర్చగా, ఎడమ వైపు ఇంజిన్‌ను 2025 ఏప్రిల్‌లో తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్