అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 5 నుంచి 9 వరకు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. భారత్ తరఫున కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.