అశ్వారావుపేటలో గుండెపోటుతో మహిళ మృతి

అశ్వారావుపేటలో ఓ మహిళ గుండెపోటుతో నడి రోడ్డుపై కుప్పకూలింది. విజయవాడకు చెందిన జరీనా (55) స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉండే తన మరిది ఖలీల్ ఇంటికి వచ్చింది. తోటికోడలుతో కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం కుప్పకూలింది. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్