దమ్మపేట మండలం మందలపల్లి జాతీయ రహదారిపై టిఫిన్ కోసం హోటల్ వద్ద ఆపిన కారును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. బాధితుడు దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హైవేపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.