వైరా మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు పొంగులేటి, భట్టి మధ్య నడుస్తున్న కోల్డ్వార్ బహిర్గతమైంది. ఇక్కడ 20 డివిజన్లు ఉండగా 190 మంది నామినేషన్లు వేశారు. ఇందులో టికెట్ ఆశించిన ఇద్దరు మంత్రుల అనుచరులు ఏమాత్రం తగ్గేదే లే అంటూ మెజార్టీ డివిజన్లలో నామినేషన్లు వేశారు. తమ నేత ఆశీస్సులతో తమకే బి ఫారం వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇద్దరు మంత్రుల్లో ఎవరిది పై చేయి అవుతుందో నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు ఆగాల్సిందే.