ఖమ్మం: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు... వీహెచ్ నిరసన

ఖమ్మం నగరంలోని కాల్వఒడ్డు వద్ద ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్) ఆందోళనకు దిగారు. మహనీయుడి విగ్రహాన్ని తొలగించడం దారుణమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాల్వఒడ్డు సెంటర్లో నిరసన వ్యక్తం చేసిన వీహెచ్, తొలగించిన విగ్రహాన్ని వెంటనే అదే స్థానంలో పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్