ఎర్రుపాలెం: విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు

చేపలు వేటకు వెళ్లి వాగులో ముగ్గురు గల్లంతైన ఘటన గురువారం ఎర్రుపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కండ్రిక గ్రామానికి చెందిన కోటి, సాయి, రాజులు మీనవోలు వాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్