ఖమ్మం: బీఎంఎస్ జిల్లా కన్వీనర్ గా యార్లగడ్డ రాఘవ

భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎమ్ఎస్) రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జాతీయ ప్రెసిడెంట్ సుంకరి మల్లేశం అధ్యక్షతన ఖమ్మం జిల్లా కన్వీనర్ గా బోనకల్ మండల కేంద్రానికి చెందిన యార్లగడ్డ రాఘవను నియమించారు. తనను ఎన్నుకోవడం చాలా సంతోషకరమని, జిల్లాలోని కార్మికులందరినీ ఐక్యం చేసి వారి సమస్యలపై పోరాటం చేస్తూ ఖమ్మం జిల్లాలో బిఎమ్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవ అన్నారు.

సంబంధిత పోస్ట్