మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ టి. దేవరాజు శనివారం ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎం సరిరామ్, దేవరాజుకు శుభాకాంక్షలు తెలిపి, మధిర డిపోను అన్ని విభాగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు, ఆదాయ వృద్ధి, సమయపాలన, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూ మధిర డిపోను ఆదర్శ డిపోగా తీర్చిదిద్దుతానని దేవరాజు తెలిపారు.