సమసమాజ స్థాపనే భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్మల జితేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మధిరలో సీపీఐ 18వ మండల మహాసభ నిర్వహించారు. దేశంలో రోజురోజుకు ఆర్థిక సమానతలు పెరిగిపోతున్నాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు.