ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంటలను అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి, పంట నష్టం తీవ్రతను సమీక్షించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని, నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు. వ్యవసాయ అధికారులను అడిగి పంట నష్టం జరిగిన ఎకరాల సంఖ్యను తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.