ముదిగొండ మండలం ముత్తారంలో జరుగుతున్న గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం తహసీల్దార్ సునీత ఎల్జిబెత్ పరిశీలించారు. పనుల వివరాలను స్పెషల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు. 20శాతం పనులు పూర్తయ్యాయని, మరో 80శాతం పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.