గత కొన్ని రోజులుగా దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్లో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన తన అల్లుడు కళ్యాణ్ శేఖర్ను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన, అక్కడ యుద్ధం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో నిలిచిపోయారు. నేటి నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరించడంతో, మంత్రిని రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.