కూసుమంచి మండలం జీళ్ళచెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సేవలను వివరించారు. ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాం తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదివితే అన్ని రకాల మేలు జరుగుతుందని విద్యార్థుల తలిదండ్రులతో పాటు ప్రైవేటు పాఠశాలాలకు వెళ్లే వారికి అవగాహన కల్పించారు.