మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించి, మోంథా తుపాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అలాగే, వరదలతో నీట మునిగిన ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శిస్తారు. ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తారు.