రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వారు కోరుతున్నారు. ఆలేరు, నేలకొండపల్లి వంటి ప్రాంతాల్లోని వరి పొలాలు ఈ వర్షాల వల్ల బాగా నష్టపోయాయి.