పిడుగుపడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే. రేగులగండి ప్రాంతానికి చెందిన కుంజ జగన్ (40)తన పొలం పని చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆ సమయంలో జగన్ పై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జగన్ కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.