భద్రాచలం గోదావరి వంతెనపై శనివారం ఒక మహిళ తన బిడ్డతో సహా నదిలోకి దూకింది. బూర్గంపాడు యువకులు రాయల సాగర్, కొమ్ము బాలాజీ వెంటనే స్పందించి, సాహసోపేతంగా వారిని కాపాడారు. తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.