బూర్గంపాడు మండలంలో మంగళవారం రాత్రి సాయిబాబా గుడి ఎదురుగా రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.